సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎన్నికల అధికారిగా హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెలిగొండ వెంకటేశ్వర్లు సమక్షంలో అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్ తో పాటు ఇద్దరు ఎక్స్ అఫీషియ సభ్యులు ఓట్లు ఉండగా మున్సిపల్ చైర్మన్ జయబాబు, ఇద్దరు ఎక్స్ ఆఫీసర్ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, గై హాజరైనట్లు తెలిపారు. అవిశ్వాస సమావేశానికి 13మంది కౌన్సిలర్స్ హాజరై అవిశ్వాస తీర్మానికి మద్దతు గా ఓటు వేశారు.చైర్మన్ జయ బాబు పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలిపామని,తరవాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కలెక్టర్ కు నివేదిక పంపిన తర్వాత తేదీని ప్రకటిస్తామని తెలిపారు..
-----------------------
Admin