సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ, ప్రియురాలు మాజీ మోడల్ దివ్యా పహుజా హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్లో ఓ హోటల్ గదిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు బుధవారం (జనవరి 3) మీడియాకు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి దివ్య పహుజాను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆమె మృతదేహాన్ని హోటల్ నుంచి కారులో తీసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోందని పశ్చిమ డిసిపి భూపేందర్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు...
-----------------------
Admin