సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి నర్సంపేట పావని నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా వాంకుడోతు కల్పన గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని,వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడడానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను చట్టపరంగా శిక్షించాలి, ఇలాంటి సంఘటన మరి ఏ ఉద్యోగికి కూడా జరగకుండా వెంటనే చర్యలు తీసుకొని వారికి శిక్ష పడేలా చూడాలని అన్నారు.కల్పన కి న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్,మండల ప్రధానకార్యదర్శులు ఈర్ల నాగరాజు,గుగులోతు తిరుపతి,ఉపాధ్యక్షులు సింగిరెడ్డి యాదగిరి, మండల నాయకులు వల్లే పర్వాతలు,ములుక రాజేష్,ఓరుగంటి రాజు,నాగపూరి సాగర్, తిమ్మారం శివ,కంచె రవి,రాపర్తి అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin