సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మౌనిక న్యూ మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమా లో ప్రిన్సిపల్ ఆదిమల్ల గోపి మాట్లాడుతూ భారతదేశ దాస్య శాoఖ్యలను తెంచివేసేందుకు మీ రక్తాన్ని మాకు ఇవ్వండి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెడతాను అని గొంతెత్తి చాటి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిపై సంగ్రామమే సరైనదని ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారి గుండెల్లో మరపిరంగులు మోగించిన మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని , నేటి యువత అందరూ ఆ మహనీయుని ఆశయాల బాటలో నడవాలని అన్నారు. నేతాజీ యొక్క పోరాట పఠిమ మనందరికీ మన భారత దేశంలో ఈనాడు ఇంతటి సకల సంపదలు సౌకర్యాలతో జీవితం కొనసాగిస్తున్నామంటే ఆనాడు మానవుడు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించి అమరులైన యోధుల పుణ్యమని అలా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన యోధులను మరిచిపోవద్దు అని అన్నారు. ఈకార్యక్రమంలోఉపాధ్యాయునిలు లక్ష్మి, శైలజ, శ్రీలత, నారాయణమ్మ శ్రీవిద్య, శిరీష, సౌజన్య, విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..
-----------------------
Admin