సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలో ఏ వీధి ఏ వాడ చూసిన, మాకు డబ్బులు రాలేదు, మాకు పైసలు ఇవ్వలేదు... అని, ఇంటి ఆరుబయట మహిళలు గుంపులు గుంపులుగా నిలబడి ఉంటున్నారు. మరి కొన్ని ప్రాంతాల ఓటర్లు తిన్నగా ఆయా పార్టీ కార్యాలయం ముందు మకాం మేశారు. మరికొందరు మహిళల ఓటర్లు ఆగ్రహ ఆవేశాలకు గురై "మాకు గాని డబ్బులు రాకుంటే " ఓట్ల స్లిప్పులు తగలబెడతామని ఊగిపోతున్నారు. సమాజానికి ఏమైపోతుంది, ఎటువైపోతుంది అంటూ మేధావులు ఆలోచనలో పడ్డారు... రాజకీయ నాయకులు కొత్త తరహా సాంప్రదాయాలను ఓటర్లకు తెలియపరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈజీ మనీ కి అలవాటు పడ్డ జనాలతో ఆడుకుంటున్న రాజకీయ నాయకులు, ఇకనైనా నవ భారతాన్ని నిర్మిద్దాం... డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తాం...
-----------------------
Admin