సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని గుర్రంపోడు తండాలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం బి వెంకటేశ్వర్లు విద్యార్థుల సంఖ్యను ఒకటికి మూడింతలుగా చూయిస్తూ మసి పూసి మారేడు కాయలు చేసినట్లుగా 100 మంది విద్యార్థులకు 250 మంది విద్యార్థులు ఉన్నట్లుగా ఆశ్రమ పాఠశాలలోని బియ్యం ,నూనె ,,కందిపప్పు ,సబ్బులు ,మెస్ బిల్లు అధికంగా దండుకుంటూ ఒక్కడే హెచ్ ఎం గా వార్డెన్ గా నెలకు రెండు జీతాలు తీసుకుంటూ తనకు అనుకూలమైన వారిని అక్కడ అవసరం లేకపోయినా వంట వారి గాను పని వారి గాను వర్కర్లు గా నియమించుకొని వారు పనికి రాకపోయినను వచ్చినట్లు వారికి హాజరు వేసి వారికి జీవితం బిల్లు చేసి వారి వద్ద నుండి కమిషన్లు తీసుకుంటున్నారని అందులో పని చేసే టీచర్లు అడిగితే తనను బెదిరిస్తున్నారని తన దగ్గర డబ్బులు వసూలు చేసేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని హెచ్ఎం టీచర్ ను టార్గెట్ చేస్తూ నీపై పోలీస్ కేసు పెడతాను నువ్వు నన్ను బెదిరిస్తున్నావ్ అంటూ ఎదురుదాడికి దిగుతున్నాడు అని గ్రామస్తులు ఇట్టి విషయమై జనవరి 8వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినను ఇప్పటివరకు దానిపై సరైన స్పందన రాకపోవటంతో గిరిజన పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కొంతమంది గ్రామ పెద్దలు ఫిబ్రవరి 5 వ తారీఖున సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన్నారు .ఇట్టి విషయంపై కలెక్టర్ స్పందించి హుజూర్ నగర్ ఆర్డీవో కి వినతి పత్రాన్ని రిఫరీ చేస్తూ వెంటనే దర్యాప్తు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించవలసినదిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్రు నాయక్, రంగా, హర్య, వంశీకృష్ణ ,రమేష్ ,శ్రీలత, వంశీ ,రంగా, సైదా, శివ, దేవ్ల తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin