సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈ నెల 28వ తేదీన గౌరవ భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో వెల్లడించారు.సుమారుగా 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు.తమకు కేటాయించిన ప్రదేశాలలో పోలీసు అధికారులు,సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలియజేశారు.గౌరవ రాష్ట్రపతి గారి పర్యటనలో భాగంగా ఈ నెల 28న ఉదయం 7.30 గంటల నుండి భద్రాచలం పట్టణ మరియు పరిసల ప్రాంతాలలో వాహన రాకపోకలకు ఆంక్షలు విధించడం జరుగుతుందని తెలిపారు.చాలా చోట్ల వాహన తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయని తెలిపారు.పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఏదైనా అత్యవసరమైతే నిరంతరం పోలీసులు అందుబాటులో ఉంటారని,డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసువారి సేవలను పొందవచ్చని కోరారు.....
-----------------------
Admin