సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా సమావేశం కొత్తగూడెం శేషగిరి భవన్ లో జిల్లా అధ్యక్షులు దుంపల అమర్ నాథ్ అధ్యక్షతన లో జరిగింది , ఈ సమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా మాట్లాడుతూ గ్రామాల అభివృధి మరియు పరిశుభ్రం చేస్తూ రెక్కలు ముక్కలు చేస్తూ ఆశిద్దాన్ని సైతం అన్నం తినే చేత్తో ఎత్తి పరివేస్తున్న కార్మికుల కనీస వేతన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన 26 వేలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయటం దురదృష్ట కరం అని అన్నారు . ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ జులై 6 నుంచి jac ఆధ్వర్యంలో రాష్ట్ర మొత్తం అన్ని రకాల పనులు బంద్ చెస్తూ సమ్మె పిలువు మేరకు జిల్లా లో అన్ని గ్రామ పంచాయతీ లో - mpo - dpo - లకు సమ్మె నోటిస్ అందించామని , BRS అనుబంధ సంఘాలు తో పాటు ఏఐటీయూసీ - citu - Iftu ఇతర సంఘాలు మద్దతు తో సమ్మె జరుతున్న నేపథ్యం లో ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనం 26,500 ఇవ్వాలి , ఇన్సూరెన్స్ 10 లక్షలు , pf , గ్రాడ్యూటీ 10 లక్షలు , పెన్షన్ 10 వేలు , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు , ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి , ప్రధాన కార్యదర్శి md యూసుఫ్ , సురేష్ , కిషోర్ , మంజుల , సారయ్య , సున్నం జ్యోతి , వాలు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin