సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ రోడ్ లో కాంగ్రెస్ యువ నాయకులు వలిగి ఆనంద్(నందు), రాజశేఖర్, నీరటి వాసు ల ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, మైనార్టీ నేత జమ్రుద్ ఖాన్, దంగు శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి వీర్లపల్లి శంకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కార్యకర్తలు వీర్లపల్లి శంకర్ పై పూలు చల్లుతూ, బాణాసంచాలు కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాంతికి చిహ్నంగా చెప్పుకొనే పావురాలను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన తెలిపారు. పదేళ్ల పాలనలో ప్రజలకు బీఆర్ ఎస్ చేసింది శూన్యమని, ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలు ఎలాగా పనిచేశారో అలాగే బీ ఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు కష్టపడితే పార్టీ విజయం ఖాయమన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు విజయవంతమయ్యారని అన్నారు. మున్ముందు కూడా ఇలాగే సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వం అప్ప, పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin