సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయితీలలో సర్పంచులు ఘనంగా జాతీయ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్ని గ్రామ సర్పంచ్ అక్రమ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన గ్రామ రూపురేఖలు మారిపోయావన్నారు. గ్రామీణ నేడు తెలంగాణ పల్లెలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ఆయన అన్నారు. అనంతరం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలతోపాటు పంచుకున్నారు. ప్రజల ప్రజాభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి శాలువా కప్పి సన్మానించారు. మొదటి బహుమతి ఊట్కూర్ చంద్రమ్మ 500/- రూపాయల నగదు అందుకోగా... రెండవ బహుమతి కుంటిమారి లలిత 300/- రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. బహుమతిలు సర్పంచ్ అక్రమ్, పంచాయతీ కార్యదర్శి రమేష్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాసం చిన్న రంగప్ప, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, ఎఈఓ మునిరాబేగం అంగన్వాడీ టీచర్లు, వివిధ మహిళా సంఘాల లీడర్లు విఆర్ఏ లు , పారిశుధ్య కార్మికులు , గ్రామ పెద్దలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin