సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం పాతర్ల పహాడ్ గ్రామంలో సంఘ బంధాల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ సేపటి దోషులను కఠినంగా శిక్షించాలని పాతర్లపాడు సంఘ బంధం సభ్యులు పులి వినోద, బోలక పద్మ, భీమ గాని రాధమ్మ డిమాండ్ చేశారు. అందుకోసం వారు సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.... పాతర్లపాడు గ్రామంలో విలేజ్ బుక్కు కీపర్ (వి బి కే) లు గా పనిచేస్తున్న గుంటూరు తిరుమలమ్మ, మద్దికుంట రాధా, కొప్పుల మానసలు, గత పది ఏళ్లుగా పని చేస్తున్నారు. అందులో వారు చెప్పింది వేదంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేస్తూ . చదువురాని సంఘ బంధం సభ్యుల సంబంధిత బుక్కులు దగ్గర పెట్టుకుని వారికి తెలియకుండానే వారిచే సంతకాలు పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. పొదుపు తీసుకున్నారంటే పర్సంటేజీలా రూపంలో వాళ్లకు ఇవ్వాల్సిందేనని అన్నారు. విబికేలు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎలాంటి అర్హతలు లేకుండా వీళ్ళు విబికేలుగా కొనసాగుతున్నారని, గ్రామంలో ఎంతోమంది కంప్యూటర్ నాలెడ్జి ఉన్న అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని వీళ్ళనే ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నూతన బాడీని ఎన్నుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిస్తున్నారని వాపోయారు...
-----------------------
Admin