సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకుని నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా షాద్ నగర్ ముఖ్య కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజల కష్టాలను తెలుసుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని అన్నారు. వైయస్సార్ చేపట్టిన సంక్షేమాలు ప్రతి ఇంట్లో దర్శనమిస్తాయని, నేటికీ ఆయన ఆశయాలను అన్ని పార్టీలు అమలు చేస్తాయని సంక్షేమాల్లో ఆయనకు సాటి ఎవరూ లేరని శంకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కె. చెన్నయ్య, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షుడు శీను నాయక్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, ముబారక్, ఖదీర్, కొప్పాపురం ప్రవీణ్, సత్యం రెడ్డి, గోదా మాధవులు, నెహ్రూ నాయక్, పటేల్ రోడ్ షర్బద్దీన్, అంజిత్, మైనార్టీ సెల్ హలీం, పొగాకు ప్రకాష్, రవికుమార్, శేఖర్, కిషోర్, గణేష్ రాథోడ్, మస్తాన్, సీతారాం, మన్నె రవి, గంగ మూవీ సత్తయ్య, అస్మత్ ఖాన్, కంసాన్పల్లి రవి, చెన్నప్ప, ప్రవీణ్, లింగారెడ్డి గూడా అశోక్, శేఖర్, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin