సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రకృతి ప్రకోపంతో విలవిలలాడిన పేద వర్గాలు గూడు చెదిరిపోయి గుండెలవిలసిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ పెద్ద మనసుతో ఆదుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఇల్లు కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేసి తన మానవత్వం చాటుకున్నారు. నియోజక వర్గంలో నిరంతర ప్రక్రియగా సహాయ ఉద్యమం చేస్తున్న వీర్లపల్లి శంకర్ ఆదివారము చౌదరిగూడ మండలంలోని పీర్జాపూర్ గ్రామంలో అకాల వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధితులకు నూనె చంద్రమ్మ 5000వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ముళ్ళ బిక్కమ్మ 2500, కొందుర్గు గ్రామంలో జులేఖ బేగం ఇల్లు కూలిపోవడంతో 10000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. కొందుర్గు గ్రామంలో మహమ్మద్ యునుస్ 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ఫరూక్ నగర్ మండలంలోని అయ్యవారి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉప్పరిగడ్డ తండాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు జాకారం శేఖర్, చించోడు మాజీ సర్పంచ్ అనంతం, ఫరూక్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎస్సీ సెల్ నరేందర్, సత్యం రెడ్డి, ఎస్టీ సెల్ నాయకుడు శీను నాయక్, తుపాకుల శేఖర్, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, మల్లేష్ గౌడ్, డిప్పీ సర్పంచ్ సీతారాం, అశోక్, నవీన్, శ్రీధర్, ముబారక్, రామ స్వామి, రాజు, కిసాన్ కాంగ్రెస్ వెంకట నరసింహారెడ్డి, దస్తగిరి, శీను, మల్లేష్, శేఖర్, యాదయ్య, బుచ్చయ్య, యాదయ్య, లక్ష్మీ నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin