సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని రామచంద్రపురం తండాలో సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ మాలోతు భీముడు నాయక్ ఆధ్వర్యంలో వాలి బాల్ పోటీలు నిర్వహించారు. ఈ వాలి బాల్ పోటీలను కాంగ్రెస్ పార్టీ మఠంపల్లి మండల అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ వాలి బాల్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి కృష్ణ తండా సర్పంచ్ రామారావు నాయక్, ద్వితీయ బహుమతి రామావత్ హనుమ, ద్వితీయ బహుమతి కృష్ణ నాయక్ దాతలు గా సహకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బానోతు భాస్కర్ నాయక్, యాంకు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin