సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : శ్రీ విజయ విఘ్నేశ్వర (గణేష్ టెంపుల్) ఆలయంలో గణేశుని శోభాయాత్ర ను ప్రత్యేక పూజలతో ప్రారంభించిన కొత్తగూడెం గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్ , కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ , గౌరవ అధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, ఆనవాయితీగా గణేశుని పూజా కార్యక్రమాలు నిర్వహించి గణేష్ టెంపుల్ నుంచి శోభాయాత్రగా ప్రకాశం స్టేడియం వరకు రావడం జరిగింది ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనది ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాలని కోరారు. కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ఆనవాయితీగా శ్రీ విజయ విఘ్నేశ్వరుని ఆలయ గణేశుని నవరాత్రి పూజలు నిర్వహించుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమంలో ఘనమైన శోభాయాత్రగా గణేష్ టెంపుల్ నుండి ప్రకాశం స్టేడియం వరకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి దారా రమేష్, ఉపాధ్యక్షులు యెర్ర కామేష్, శ్రీమణిదీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin