Monday, 27 July 2026 11:32:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవజాతి మనుగడకై వృక్షాలు ఎంతో అవసరం.. - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 27 August 2023 06:19 AM Views : 343

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అనంతరం ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలో ఏకధాటిగా 8 సంవత్సరాలు నడిపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది.మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతి మొక్కని కూడా కాపాడేలా అధికారులకు అన్ని విధాల సలహాలు , సూచనలు అందించడంతోపాటు.. మొక్కల్ని కాపాడే బాధ్యత కూడా వారి దినచర్యలో భాగంగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది.సుమారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఎన్నో కోట్ల మొక్కల్ని నాటడం నాటిన ప్రతి మొక్క కూడా నేడు పచ్చదనంతో గ్రామాలకు స్వాగతం పలుకుతుంది..హరిత విప్లవానికి నాందిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఎంతో గర్వకారణం.. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటి వాటిని పరిరక్షించడంలో కూడా అధికారుల పాత్ర అభినందనీయమని అన్నారు..ఇకపై కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా పెట్టుకోవాలని అధికారులు వాటిని పర్యవేక్షించాలని లేనట్లయితే అధికారులపై కూడా అదే స్థాయిలో చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి.. వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు.. మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వరరావు.. టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :