సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఈనెల 5వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన, ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తెలియజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వైసిపి ఆధ్వర్యంలో ఈనెల 5 నా ఫీజు పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు ను అంధకారంలోకి ని ట్టేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఆయన అన్నారు. కావున నియోజకవర్గంలోని విద్యార్థులు, విద్యార్థు ల తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా రావాలని ఆయన కోరారు....
-----------------------
Admin