సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అబద్దాల కాంగ్రెస్ బిజెపి పార్టీలను ప్రజలు నమ్మడం లేదని టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి పార్టీలో చేరుతున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం షాద్ నగర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఇంద్రానగర్, ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబద్ధాల కాంగ్రెస్, బీజేపీలను మేము గానీ, ప్రజలు గానీ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని అందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నామని అన్నారు.
-----------------------
Admin