సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వైద్య ఆరోగ్య సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు జీవో నెంబర్ 142 ను రద్దు చేయాలని కోరుతూ భారీగా కదిలివచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మానవ వనరుల హేతుబద్దీకరణ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను కుదించడానికి ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు జీవో నెంబర్ 142 రద్దు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు క్యాడర్ అసోసియేషన్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ 142 జీవో రద్దు చేయనట్లయితే అక్టోబర్ 3వ తేదీన డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వారి కార్యాలయం హైదరాబాద్ నందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 5వ తేదీ నుండి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని సంఘాలతో క్యాడర్ అసోసియేషన్ లతో కలిపి నిరవధికంగా సమ్మె కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు , బానోతు నాగేశ్వరావు, గొంది వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, శ్రీనివాసరావు, రమేష్, సుశీల, జానకి, కృష్ణయ్య, లాలు లాల్ , మోహన్ పాల్గొన్నారు.
-----------------------
Admin