సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరం బురహాన్ పురంకు చెందిన వ్యాపారి దందు బోయిన లక్ష్మణరావు వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీసినట్టు సోమవారం ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను 2015 నుండి శ్రీ తిరుమల నెట్ కేఫ్ పేరుతో ఇంటర్నెట్ వ్యాపారాన్ని ప్రారంభించానని, ప్రారంభంలో మంచిగా నడిచిన నెట్ కేఫ్ తదనాంతరం 2019 నుంచి కరోనా పరిస్థితుల మూలంగా వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో. పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాన్ని కొనసాగించానని తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఏ నెలకు ఆ నెల అధిక వడ్డీలు తీర్చడానికి సరిపోయిందని, దీంతో అప్పులు ఇచ్చినవాళ్లు బలవంతంగా ఖాళీ ప్రాంసరీనోట్లు, చెక్కులపై సంతకాలు తీసుకుని వేధిస్తున్నారని , దీంతో విధి లేని పరిస్థితుల్లో ఆరుగురిని ప్రతివాదులుగా చేరుస్తూ 11 లక్షల 25 వేలకు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. కాగా తనకు గల ఆస్తులు వివరాలను కూడా పిటిషన్ లో తెలియజేశారు. పిటిషనర్ తరపున న్యాయవాదిగా దొంతిపోయిన రామారావు వ్యవహరిస్తున్నారు.
-----------------------
Admin