సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలో భారీ ప్రభుత్వ భూ కుంభకోణం చోటు చేసుకుంది ఈ కుంభకోణంలో గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్ గా పని చేసిన వజ్రాల జయశ్రీ మరియు ధరణి ఆపరేటర్ జగదీష్ ప్రధాన సూత్రదారులు. హుజూర్ నగర్ మరియు బూరుగడ్డ గ్రామాల రెవెన్యూ పరిధిలో 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతర వ్యక్తుల పేర్లపై అక్రమంగా మార్పిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ లను 220(బి),406,409,420,467,468 సెక్షన్ల క్రింద అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగినది. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం 2019 నవంబర్ నుండి 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో నాటి హుజూర్ నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ఇద్దరు ఉన్నతాధికారులకు తెలియకుండా అక్రమంగా బురుగడ్డ రెవెన్యూ పరిధిలో 16.30 గంటల భూమిని పచ్చిపల ప్రియాంక పేరున, 4.38 ఎకరాల భూమిని జగదీష్ అక్క మడిపల్లి స్వప్న పేరున మరియు హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలో గల 14.36 గంటల భూమి తల్లి ప్రియాంక పేరున ప్రభుత్వ భూమిని (మొత్తం 36.23 ఎకరాలు, విలువ 1,56,24,437.5/- ) ILRMS పోర్టల్ ద్వారా బాధలాయించి చేసి 14,63,004/ రూపాయల రైతు బంధు సొమ్ము లబ్ధి పొందినట్లుగా విచారణలో తెలినందున ఇరువురిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తహసీల్దార్ వజ్రాల జయశ్రీ, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ లను హుజూర్ నగర్ పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించారు....
-----------------------
Admin