సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని కరకాయల గూడెం గ్రామం లోని అయ్యప్ప స్వామి 6వ వార్షకోత్సవం , ముత్యాలమ్మ గుడి, నవ గ్రహాల పూజా కార్యక్రమాలలో హుజూర్ నగర్ నియోజకవర్గం ఓజో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిల్లుట్ల రఘు పాల్గోన్నారు. అనంతరం అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది రఘు మాట్లాడుతూ నియోజక వర్గం లో ఎప్పుడు లేని విధంగా గత రెండు సంవత్సరాల నుండి అనేక దేవాలయాల ప్రతిష్టలు బొడ్రాయి కార్య క్రమాలు అన్నదానం కార్య క్రమాలు చేశాం అని విద్యార్థులకు కోచింగ్ ఇప్పించి ఈరోజు నియోజక వర్గంలో ఎన్నడూ లేని విధంగా మన నియోజక వర్గం నుండి 80 నుండి 100 మందికి కానిస్టేబుల్ ఎస్ ఐ జాబ్ లకు ఎంపిక ఐనదుకు గర్వ కారణంగా ఉంది రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఆరోగ్య సమస్యలు , విద్యార్ధుల చదువులు , యువతకి ఉపాధి లాంటివి అని ఏర్పాటు చేసే బాధ్యత నాదే అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, శివా రెడ్డి, గ్రామం పెద్దలు, గుడి కమిటి సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin