సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు:నియోజక వర్గంలో కుల,మత,వర్గ,వర్ణ, బేధం లేకుండా అన్ని వర్గాల పేదవారిని ఆదరిస్తున్న ఆశాజ్యోతి పిల్లుట్ల రఘు అని ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న అన్నారు.పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం ఆవాస గ్రామం బెట్టేగూడెం క్రీస్తు సంఘం చర్చ్ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనిమాట్లాడారు.మండలంలోబడులకు,గుడులకు,నిరుపేదలకు,నాయకులవిగ్రహనిర్మాణాలకు,అన్నదానలకు,వివిధ రకాల కార్యక్రమాలకు తనకు తోచినంత సహాయం చేస్తూ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న యువ నాయకుడు పిల్లుట్ల రఘు అని, బెట్టేగూడెం ఓజో ఫౌండేషన్ సభ్యులు అడగగానే అన్నదానంకు ఆర్థిక సహాయం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు గంగరాజు యాదవ్, పిట్టపెదఅబ్రహం,భాస్కర్,నర్సయ్య,యువకులు,మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin