సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికల్లో మాయగాల్ల మాటలు నమ్మి మోసపోవద్దని బుల్లితెర నటుడు జబర్దస్త్ ఫేం కొమరక్క కోరారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం లోని హాజిపల్లి, కిషన్ నగర్, బాపన్ గుట్ట తాండ, ముండోన్ రాయి తాండ, పుల్చర్ల కుంట తాండ, పూసల తాండ, బీమారం తాండ, దొంతికుంట తాండ, మరియు తదితర తాండాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా కొమరక్క పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది. కొమరక్క మాట్లాడుతూ.. మీ యొక్క గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలని వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్న అపర భగీరథడు విష్ణన్న అని అన్నారు. ఏ పదవి లేకుండా ఇన్ని పనులు చేస్తుంటే కొందరు ముర్కులు ఓర్వలేక ఎక్కడ విష్ణన్నకు ప్రజల్లో మంచి పేరు వస్తుందో అని ఎన్నో కుట్రలు, కక్ష సాధింపు చర్యలకు దిగి ఎన్ని ఆటంకాలు ఏర్పర్చిన బెదరకుండా ప్రజా క్షేత్రం లో ఉన్న వ్యక్తి విష్ణన్న కాబట్టి ఆదరించి అభిమానించి సింహం గుర్తు పై ఓటు వేసీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చేవారిని ఎందరినో చూసారు ఎన్నికలు అయిపోయాక ఇగ వారి జాడ దొరకదు అని అన్నారు. విష్ణన్న ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకునే గొప్ప వ్యక్తి కాబట్టి ఆదరించండి అని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, కిషన్, గణేష్, నరేష్ గంగాదర్, ఇస్నాతి శ్రీనాథ్, హరి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin