సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు తదితరాలకు చెంది గత ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు వొచ్చిన 44331 దరఖాస్తులలో 33990 ని స్క్రూటి ని అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కె మీనా జిల్లా ఎలెక్టోరల్ & కలెక్టర్ లతో ఓటరు నమోదు, దరఖాస్తులు పరిష్కారం, ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు), డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపు పై సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంకార్యనుండి వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు తెలుపుతూ, జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కలిగించే ప్రక్రియ లో కాలేజ్ విద్యార్థుల తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. . ఫారం 6 కి చెందిన 21988 దరఖాస్తులకు గాను 16739 ఆమోదించి నట్లు పేర్కొన్నారు. 2,384 తిరస్కరించామని వివరించారు. ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు) 149 గుర్తించడం జరిగిందన్నారు. వాటిని ఈ ఆర్ ఓ, బి ఎల్ వో అధర్వయంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు: జిల్లాలో 54 పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు 32 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక ఎన్నికల సెల్ ఏర్పాటు చేయుచున్నాము జిల్లా కలెక్టర్ వివరించారు. స్థానిక కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల సహా ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ, శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి....
-----------------------
Admin