సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానానికి బుధవారం కొండకమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సోదరుడు అంజనప్ప 5 విద్యుత్ కాంతుల దీపాపు సెట్లు తహశీల్డర్ కనుకుంట్ల శ్రీధర్ చేతుల మీదుగా అందించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.మే 5వ తేది శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయ స్థాపన వార్షికోత్సవ మహోత్సవాలు సందర్బంగా విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా ఆలయానికి అలంకరణ కోసం రంగుల విద్యుత్ దీపాల సెట్లు దాత అంజనప్ప అందించినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ కోఅప్షన్ సభ్యులు టైలర్ నిజాం,సిఓ విశ్వనాధ్ రెడ్డి,విఆర్ఓలు లోకేశ్వరి,లక్ష్మిదేవమ్మ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin