సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పబ్లిక్ క్లబ్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆధునికరించిన ఆడిటోరియం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్లబ్ సభ్యులు వివిధ రంగాల్లో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులని అందరి సహకారంతో విద్యా వైద్య సామాజిక సేవ రంగాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లబ్ సభ్యులు ఆదర్శంగా నిలవాలన్నారు. క్లబ్ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా క్లబ్ పాలకవర్గం ఎమ్మెల్యేను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వక్క వంతుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి వల్లూరి రామిరెడ్డి, క్లబ్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin