సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలో విషజ్వరాలు మలేరియా,డెంగ్యూ ప్రబలే అవకాశం ఉన్నందున తక్షణమే జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4వ వార్డు పాతకొత్తగూడెంలో పర్యటించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా వర్షాకాలంలో డెంగ్యూ,విషజ్వరాలు ప్రబలుతున్నా వైద్యారోగ్య శాఖలో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారుల్లో చలనం లేదని,సీజనల్ వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెంది, తీరా పేదల ప్రాణాలు పోయాక స్పందిస్తున్నారని విమర్శించారు.సీజన్ ను దృష్టిలో పెట్టుకొని పారిశుధ్యపనులు చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు నిధులు లేకపోవడంతో ఎలాంటి పనులు చేయలేక పోతున్నారన్నారు.దానికి తోడు పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని,వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో విషజ్వరాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయని.తక్షణమే అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా కావున ఆరోగ్య జాగ్రత్తలు తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు,మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,ఇమ్మడి కోటి,వంగా రవిశంకర్,గూగులోత్ రాహుల్,ఆవాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin