సర్కార్ టీవీ న్యూస్ / జనగామ జిల్లా : భారతీయ జనతా పార్టీ నర్మెట్ట మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నర్మెట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలపడం జరిగింది. అనంతరం మండల అధ్యక్షులు ధరావత్ రాజు నాయక్ మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ అరెస్టును భారతీయ జనతా పార్టీ నర్మెట్ట శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వారిని అధికార బలం తోటి పోలీస్ యంత్రాంగం తోటి గొంతు నొక్కేయడం అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు టిఆర్ఎస్ కు ప్రజాదరణ తగ్గిపోయి ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ గుండాల చేత బిజెపి నాయకులపై దాడులు చేస్తున్నారని అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పిన్నిటి శ్రీనివాస్ రెడ్డి తోకల శేఖర్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ విజయ్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బైక్ అండ్ రంజిత్ బూత్ అధ్యక్షులు ఆంజనేయులు దేవేందర్ ప్రతాప్ రెడ్డి ఎల్లరెడ్డి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin