Sunday, 26 July 2026 05:13:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చిల్డ్రన్ పార్క్ ను అమరవీరుల స్మృతివనంగా ప్రకటించాలి... -బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 06 August 2023 07:26 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ తొలి దశ,మలిదశ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం....మరీ ముఖ్యంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలలో పాల్గొన్నారని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్ గుర్తు చేశారు.తెలంగాణ అమరవీరుల మృతికి చిహ్నంగా కొత్తగూడెం బస్టాండ్ వద్ద గల చిల్డ్రన్స్ పార్కును అమరవీరుల స్మృతివనంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ శ్రేణులతో కలిసి సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ 1969 వ సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో కొత్తగూడెంలో ఇద్దరు వ్యక్తులు అమరులయ్యారని గుర్తు చేశారు.అదేవిధంగా మలిదశ ఉద్యమంలో సైతం కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం చిరస్మరణీయమైన పోరాటాలు చేసిందని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కోసం సింగరేణి యాజమాన్యం ఏదైనా ఒక కార్యచరణ రూపొందిస్తే బాగుంటుందని వేచి చూశామని అలాంటిదేమీ జరగకపోవడం శోచనీయమన్నారు.ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలి ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను తమ ఆత్మ బలిదానాలతో ప్రపంచానికి చాటిన అమరవీరుల త్యాగాలను మరిచిపోవద్దని అన్నారు.తొలి,మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు సరైన నివాళులు అర్పించాలంటే కొత్తగూడెంలోని చిల్డ్రన్స్ పార్క్ ను అమరవీరుల స్మృతివనంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.అనంతరం జీఎం వెల్ఫేర్ బసవయ్య కు వినతిపత్రం అందజేశారు ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,జిల్లా కార్యదర్శులు మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: