సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో కొత్తగూడెం అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన యమ్మన భాను తేజ గత 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడుతూ వివిధ పార్టీల నుండి దాడులు,బెదిరింపులు సైతం లెక్కచేయకుండా కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశాడు. రేవంత్ రెడ్డి,సీతక్కలకు నమ్మిన బంటు గా పాల్వంచ లో గుర్తింపు పొందాడు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు 2019 లో పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా పని చేశారు.ప్రస్తుతం మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో పోటీ చేయగా అత్యధిక మెజారిటీతో కొత్తగూడెం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు యమ్మన భాను తేజ. తనకు ఓటు వేసి గెలిపించిన యువతకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.
-----------------------
Admin