సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : అంగన్వాడీ టీచర్ లకు అప్పగించిన బిఎల్ఓ విధులను వెంటనే తొలగించి ఉపశమనం కలిగించాలని తహశీల్దారు శ్రీదేవి కి అంగన్వాడీ టీచర్ లు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అంగన్వాడీ కేంద్రాలలో విధులు నిర్వర్తిస్తూ, జాబ్ చార్ట్ ప్రకారం శాఖ పరమైన కార్యక్రమాలు,పూర్వ ప్రాథమిక విద్య,ఆరోగ్య కార్యక్రమాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పోషణ ట్రాకర్,తదితర అంశాల జీయొ ట్యాగింగ్,ఆన్లైన్ వర్క్ ఉన్నందున మేము తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నాము అని, మా పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి బిఎల్ ఓ విధులనుండిమినహాయింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ వసుంధర, విజయలక్ష్మీ,మనెమ్మ, నిర్మల,ఇందిరా,స్వాతి,కమల,సరిత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin