సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండల కేంద్రం గడ్డిపల్లి, ఎర్రగుంట కాలనీల నందు బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారం కార్యక్రమం లో భాగంగా సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ లో ఒక గజదొంగను గద్దె దించడానికి ఇంకో గజదొంగను ఎన్నుకోవాలని చూస్తున్నరే తప్ప..మనకోసం తన మహోన్నతమైన ప్రభుత్వ ఉద్యోగానికి"రాజీనామా"చేసి వచ్చిన డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ని ఎందుకు మరిచిపోతున్నారు? ఆలోచించండి. మన ప్రక్కన కర్ణాటక ఎన్నికల్లో అమలుకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తల పట్టుకు కూర్చుంది. ఆలోచించండి..! డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సర్ ప్రకటించిన"మేనిఫెస్టో" ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర"అభివృద్ధి పథం"లో ముందుకు దూసుకుపోతుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. చదువుకున్న ప్రతిఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు, అలా అని మనజీవితాలను నాశనం చేసుకోలేము. ఎదో ఒక ఉపాధి దొరికితే దానిని "ఆసరా"గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు"దైర్యం"గా రాసుకొని మన "సత్తా" చాటవచ్చు..! ఓటరు మహాశయులారా బాగా ఆలోచించండి. ఏనుగు గుర్తుకు ఓటు వేసి బహుజనుల సత్తా ఏంటో ఈసారి నిరూపించాలి అని పిలుపు నీచ్చారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, మండల మహిళా కన్వీనర్ గడ్డం శ్రీదేవి, బొజ్జా పవన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin