సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలం తమ్ముడి పల్లి ఎస్సీ పాలెం లో గత రెండు నెలల నుండి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ఎస్సీ పాలెం ప్రజలు. ఎన్నో ప్రభుత్వాలు మారిన మారుమూల ప్రాంతాల గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కారం చూపలేకపోతున్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్ లప్పుడు మీ గ్రామాలకు అవి చేస్తాం ఇవి చేస్తాం నీకు నీటి కష్టాలు లేకుండా చేస్తాం అని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారే కానీ దళిత గ్రామాలలో దళితవాడలలో తాగునీటి సమస్యను మరిచిపోతున్నారు. గత రెండు నెలల నుండి ఎర్రగొండపాలెం మండలం తమ్ముడి పల్లి దళిత ఎస్సీ పాలెం లో నీటి సమస్యతో బాధపడుతున్నారు కానీ ఏ ఒక్క అధికారి త్రాగునీటి సమస్యపై స్పందించిన దాఖలాలు లేవు ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసుకున్న మాకు తాగటానికి నీళ్ళు ఇవ్వండి ప్రభు అని వేడుకున్న కనికరము చూపలేకపోతున్నారు. గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటి పోవటం వలన తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు మావి కూలికి పోతేనే పొట్ట గడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆడ మగ కూలికి వెళితేనే కానీ మా కుటుంబాలు బ్రతికే పరిస్థితి చేసేది ఏమి లేక తాగునీటి కోసం భార్యాభర్తలలో ఎవరో ఒకరు తాగునీటి కోసం ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుంది 250 కుటుంబాలు, 450 ఓటర్సు కలిగిన మా ఎస్సీ పాలెం లో పాలానికి మొత్తానికి ఒకే ఒక బోరు బోరు నుండి అరగంటకు ఒక బిందె నిండుతుంది ఆ ఒక్క బింద కోసం గంటల తరబడి కూలి పనికి వెళ్లకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చింది పై అధికారులు స్పందించి తమ్ముడి పల్లి దళితవాడలోని నీటి సమస్యను పరిష్కరిస్తారని ఎస్సీ పాలెం ప్రజలు కోరుతున్నారు...
-----------------------
Admin