సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండలం : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ సర్కార్ ను నిలబెట్టి, మూడోసారి కూడా కచ్చితంగా కేసీఆర్ రాజ్యమే రాబోతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దీమా వ్యక్తం చేశారు. ఆదివారం నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేకగూడా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడవత్ రాజు, పాత్లావత్ భాస్కర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరినట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పిఏసిఎస్ చైర్మన్ మంజుల, ఎంపిటిసి రాజు, శిరీష, శ్రీశైలం, తిరుపతిరెడ్డి, నజీర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి కేసీఆర్ ప్రభుత్వం చేస్తుందని అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయిని ఆక్రమించిందని అన్నారు. ఎవరెన్ని రాజకీయాలు చేసిన ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని, కచ్చితంగా మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరబోతుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో మేకగుడా గ్రామానికి చెందిన రాజు, భాస్కర్, ధన్సింగ్, శంకర్, పాండు, రమేష్, భాస్కర్, రెడ్యా, బాబు, వినోద్, శీను, దేవేందర్, లింగం, శివ, బాలరాజు, రవీందర్, బాబు, సుధాకర్, వేణుగోపాల్, బాబు, శివ, నరేష్, సిద్దు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin