Sunday, 26 July 2026 04:15:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిజాం నిరంకుశత్వంపై పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ... - బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

Date : 27 September 2023 08:44 AM Views : 228

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణ మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న ఐలమ్మ విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి పూల మాలతో ఘనంగా నివాళులు అర్పించారు. వారితో పాటు చెట్ల వెంకటేష్, మల్చలం మురళి, మఠం ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఆ పోరాటంలో అసువులు బాసి అణగారిన వర్గాలకు అందరికి ఒక స్ఫూర్తి, వీరవనితగా చరిత్రలో నిలిచిన చాకలి ఐలమ్మను మనమందరం స్మరించుకోవాలని అన్నారు. తెలంగాణాలో ఉన్న మహిళలందరూ కారంపొడి, రోకలి బండలను ఆయుధాలుగా మార్చుకొని నిజాంపై పోరాటం చేసిన చరిత్ర ఎంతో గొప్పదని, మరి ఆ చరిత్రను ముఖ్యమంత్రి కెసిఆర్ అవమాన పరుస్తూ, తెలంగాణా వచ్చిన తర్వాత నిజామోడు గొప్పోడు అని చెప్పి, తెలంగాణా స్వాతంత్రం కోసం అమరులైన వీరుల చరిత్ర ను విస్మరించారని అన్నారు. అదేవిదంగా సెప్టెంబర్ 17 న తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరిపించాల్సిన ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం పేరుతో చరిత్ర ను పూర్తిగా వక్రీకరిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా మీటింగ్ లు పెట్టి అమరవీరులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కానీ స్మరించుకోలేదని అన్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం, కాసిం రజ్వి ఏంఐఎం పార్టీని మెప్పించడం కోసమే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల విధానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జె నర్సింహా, శ్రీనివాస్ చారి, గజ్జల ప్రవీణ్, ఆంజనేయులు, గట్టొజు విజయ్, కాసోజు శివ, శ్యామ్ సుందర్, శ్రీశైలం, బాస రాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :