సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సెప్టెంబర్ 14 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ నందు, తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నూతన కమిటీ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జవహర్ నగర్ లో ప్రజల పక్షాన నిలబడి, వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస జవహర్ నగర్ ఉపాధ్యక్షులు బాచుపల్లి రమేష్ చారి,కార్పొరేటర్లు బల్లి రోజా శ్రీనివాస్ గుప్తా, శారద మనోధర్ రెడ్డి, మేక లలిత యాదవ్, ఏ కె మురుగేష్ , ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, జమాల్పూర్ నవీన్,తెరాస పార్టీ నాయకులు బూడిద వెంకటేష్ , ఏం డి సాధిక్ తదితరులు పాల్గొన్నారు. టి జే ఏ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిదులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలను అధికారులకు తెలియజేసే ప్రజా వారధులుగా విలేకరులు నిలుస్తారని,వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, పార్టీ కార్యకర్తలు బండ కింది ప్రసాద్ గౌడ్, బోయిన్ పల్లి నరసింహులు, కాయిత రాజు,రాహుల్, మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.నిజాన్ని నిర్భయంగా చెప్పగల వృత్తి జర్నలిజం అని ,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారికి తగిన న్యాయం చేయడం కొరకే ఈ మా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి. జే. ఏ ) ఏర్పాటు చేయడం జరిగిందని టి జే ఏ పంతుల శ్రీనివాస్ పాల కుమార్, రాజేష్ , తుమ్మ రంజిత్, సాయి కృష్ణ చారి, తుమ్మ నరేష్ ,, కోటి, నరసింహ, అనిల్ టి జే ఏ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జవహర్ నగర్ బిజెపి అధ్యక్షుడు రంగుల శంకర్,సి పీ ఐ శంకర్, గాయకుడు వెంకట చారి,కుతాడి గోపి, వెంకటాపురం ప్రవీణ్ జాన్, దివ్యాంగుల నాయకులు మోనార్ దుర్గాప్రసాద్, రాజేందర్ మరియు పలు ప్రెస్ క్లబ్ మిత్రులు హాజరయ్యారు.
-----------------------
Admin