సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అదేశాల మేరకు పుట్టపర్తి నియోజవర్గ టిడిపి ఇంఛార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచనల మేరకు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పిట్ల సుధాకర్ అధ్వర్యంలో "టిడిపి 41 వ ఆవిర్భావ దినోత్సవం " సందర్భంగా ఓబులదేవర చెరువు మండలంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి పిట్ట సుధకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు టిడిపి పార్టీ పెట్టి దాదాపు 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా "ఎన్టీఆర్ ఆనాడు బడుగు బలహీన వర్గాల యస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల ఆశాజ్యోతి* తెలుగు వారి సత్తాను ఢిల్లీలో చాటి చెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ కుడు,గూడ,గుడ్డు పేదలకు అందించిన తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం తెలుగోడి ఆత్మగౌరవం చాటి చెప్పిన ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మక నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకొచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు మరియు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశారు విప్లవాత్మకమైన, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మార్పులు తీసుకొచ్చారన్నారు. తదనంతరం. టి ఎన్ టియుసి పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షులు టైలర్ నిజాం, నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోరు రమణ, రాష్ట్ర బి సి ప్రధాన కార్యదర్శి జరిపిటి అంజిన్నప్ప, పుట్టపర్తి నియోజకవర్గం మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్, పుట్టపర్తి నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు టిడిపి పార్టీ ఎలా ఆవిర్భవించింది.పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సమితి వ్యవస్థను రద్దుచేసి మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. టిడిపి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్,టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు,టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురుంచి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, నాయకులు కంచి సురేష్, మల్లాపల్లి సాంబశివారెడ్డి, మస్తానమ్మ, అంజనప్ప, సీనా, చాంద్ బాషా, అంజన్ రెడ్డి, ఓబుళపతి, మీసేవ సుధాకర్, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin