సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాలలో 1993 94 వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చైతన్య భారతి పాఠశాల 1993- 94 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం స్థానిక బ్రాహ్మండ్లపల్లి ప్రభాకర్ ఏసి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమతో కలసి చదువుకొని నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిన నాటి విద్యార్థులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దిన నాటి గురువులు సుధాకర్ రావు, జీవి, నాగార్జున, శేఖర్, జానకి రాములు, ఆనంది, ఆమీనా, ఉపేందర్, బి శ్రీనివాస్ లను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని నాటి జ్ఞాపకాలు పంచుకొని నేడు వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల్లో చాలామంది ఉన్నత హోదాల్లో ఉండడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి పాఠశాల 1993-94 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin