సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలో 14 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల సమ్మెను ఆదివారం రోజున కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగి కూడా సంతోషంగా లేరని గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు నెలసరి జీతాలు మొదటి తేదీనే వచ్చేవని ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో 15 తారీకు వచ్చిన నెలసరి జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు రావడం లేదని అన్నారు. 14 రోజులు గా అంగన్వాడీ టీచర్లు సమ్మె చేపడుతున్న ప్రభుత్వం, మంత్రి సత్యవతి రాథోడ్ పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. అంగన్వాడి టీచర్ల సమ్మె కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వెంటనే అంగన్వాడి టీచర్లను ప్రభుత్వం చర్చలకు పిలిచి వారి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ మెంబర్ కోల వెంకటేష్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, బాల్ కిషన్, రవి కాంత్ రెడ్డి, బట్టు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin