సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రామాభివృద్ధి తమ లక్ష్యం కూస సరిత సుదర్శన్ పటేల్.. చెన్నరావుపేట మండలం ఖాదర్పేట గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కూస సరిత సుదర్శన్ పటేల్ తమపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారు.చాలాకాలంగా కాంగ్రెస్లో పనిచేస్తూ గ్రామానికి, పార్టీకి సేవలు అందించిన తమ కుటుంబానికి అర్హత ఉన్నా,అంతర్గత రాజకీయాల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా భార్య సరితకు పార్టీ టికెట్ ఖాయమనే నమ్మకం. కానీ కొందరు నేతల కుట్రలతో ఆ అవకాశం పోయింది” అని తెలిపారు.గత రెండు ఎన్నికల్లో కూడా తమ సొంత పార్టీలోనే కొందరు నేతలు వెన్నుపోటు, బ్లాక్మెయిల్ చేసి ఆర్థిక నష్టం కలిగించారని ఆరోపించారు. “నా ఎదుగుదల ఇష్టం లేని కొందరు నేతలు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నా గురించి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో నాపై తప్పు అభిప్రాయాలు పెరిగాయి” అని చెప్పారు. ఈసారి ఏ మాత్రం వెనుకడుగు వేయనని స్పష్టం చేసిన సుదర్శన్, గ్రామ ప్రజల మద్ధతుతో తన సతీమణి కూస సరిత ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింపినట్లు తెలిపారు. “నామినేషన్ వేసిన రోజు నుంచే ఉపసంహరణకు ఒత్తిడులు వస్తున్నాయి.కానీ నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలే నాకు బలం” అని దృఢంగా చెప్పారు.తమనిపై జరుగుతున్న రాజకీయ ఒత్తిడులు విచారకరమని, ప్రజా మద్దతుతో సరిత ను గెలిపించడం తమ లక్ష్యమని కూస సుదర్శన్ పటేల్ స్పష్టం చేశారు.
-----------------------
Reporter