సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 15న ఖమ్మం జిల్లాలో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ టౌన్ వర్తక సంఘం భవనం లో నిర్వహించారు..ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అజ్మీరా అత్మరావు నాయక్ , జిల్లా అధ్యక్షులు బోబ్బ భాగ్యరెడ్డి , అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరగబోయే భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రివార్యులు అమిత్ షా పాల్గొంటారని ఈ సభ కి కార్యకర్తలంతా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గంథం సతీష్, హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, మఠంపల్లి మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు దేనుమకొండ రామరాజు, గరిడేపల్లి ప్రధానకార్యదర్శి కుక్కాడపు వెంకటేశ్వర్లు, చిత్తాలురి సోమయ్య, మంద వెంకటేశ్వర్లు, చింతలపూడి ఉమామేశ్వరరావు ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin