సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళితబంధు,గృహలక్ష్మి పథకాలు అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని ఎంపిటిసి మీసాల ఉపేందర్ కోరారు.శుక్రవారం నాడు నాగిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం బెట్టేగుడెంలో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొని మాట్లాడారు.గ్రామంలో దళితులు రోజు వారి కూలి పనులు చేసి దుర్బర పరిస్ధితులను ఎదుర్కొంటున్నారని,చాలామందికి పక్క గృహాలు లేవని వారందరికీ దళితబంధు, గృహలక్ష్మి పథకాలు అందించాలని, చాలా కుటుంబాల వారు వివాహం అయి పిల్లలు ఉన్నవారికి కూడా ఆహార భద్రత కార్డులు ప్రభుత్వం మంజూరు చేయలేదని, కాని గృహలక్ష్మి పథకానికి ధరఖాస్తుకు ఆహారభద్రత కార్డు ఉండాలని నిబంధన ఉండటంతో చాలా మంది అవకాశం కోల్పోతున్నారని ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన కోరారు.గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని,గ్రామస్తులు ప్రభుత్వ విద్యా,ఆరోగ్య, ఇతర సేవలను వినియోగించుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ చిలక రాజు నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి అనూష,ఫీల్డ్ అసిస్టెంట్ కోటయ్య, ఆరోగ్య సిబ్బంది నాగేంద్ర,కవిత,ఉపసర్పంచ్ మంద కవిత,గ్రామ పెద్దలు మంద నాగయ్య, మంద సైదులు, ముల్కలపల్లి శ్రీను,అరోను,కోటయ్య, సైదిరెడ్డి,మరియదాసుమహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin