సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీఆర్ఎస్ నాయకులు ఓ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ల దీనికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి 2, 300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానీకం వస్తారని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. అందువల్లే భాగ్య నగరంలో ట్రాఫిక్ మళ్లింపులను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
-----------------------
Admin