సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు .సోమవారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... పూర్వీకుల నుండి అమ్మవారిని ప్రతిష్టించి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎలుగూరి అలివేలు చంటిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్, జామాల్ పూరీ,పండరి నాథ్, జమాల్ పూరి బాలీశ్వర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గొబ్బిళ్ళ కరుణాకర్ ,కొప్పుల సతీష్, కూతురు సతీష్, శ్యామల శివ, రావుల ఫణి, బాలాజీ, వీరేష్ ఆకుల సింధు, యశస్విని, ఇతరులు పాల్గొన్నారు.
-----------------------
Admin