సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేటలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు,ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు,సిపిఐ మండల కార్యదర్శి ఎస్కె దస్తగిరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అరకురా ఇస్తున్నాయని సంపూర్ణంగా ఏ పథకాన్ని అమలు చేయట్లేదని ప్రభుత్వ ప్రకటించిన పథకాలను తక్షణం అమలు చేయాలని,ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు,ఇల్లు లేని నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు తక్షణం ఇవ్వాలని,సొంత జాగా ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని,రేషన్ కార్డు లేని వారందరికీ తక్షణం రేషన్ కార్డులు ఇవ్వాలని. పెన్షన్ లో రానివారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని. ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధువు దళితులందరికీ వర్తింపచేయాలని అందరికీ ఇవ్వాలని ప్రభుత్వ అధికారుల ద్వారానే ఎన్నిక జరపాలని. మహిళలందరికీ వడ్డీ లేకుండా 20 లక్షల రుణాలు ఇవ్వాలని. దమ్మపేటలో జూనియర్ కాలేజీ వెంటనే ప్రారంభించాలని. దమ్మపేట కి కోర్టు మంజూరైన పనులు జరగట్లేదని తక్షణం పనులు కొనసాగించి కోర్టు ప్రారంభించాలని రైతులందరికీ రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించినారు లేని పక్షాన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రోజుకు ఒక ఆందోళన చేపడుతామని ప్రభుత్వమెళ్ళ నుంచి ప్రభుత్వ పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపినారు,ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సుకుపాక ధర్మ ,బత్తుల సాయి, ఏఐటియుసి నాయకులు దొంగ లక్ష్మీనారాయణ,రాపోలు శివన్నారాయణ,రాయల మురళి,మహిళ మండల కార్యదర్శి జానీ బేగం,దళిత హక్కుల పోరాట సమితి మండల నాయకులు నక్క నాగమణి,రైతు సంఘం నాయకురాలు గాజుబోయిన కృష్ణవేణి,జన్ బి,వీరలక్ష్మి కుమారి,నల్లబోతుల నాగార్జున,నల్ల ప్రసాదు తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin