సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాన్ షాపులలో ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులను నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసమే పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని తెలిపారు. పాన్ షాప్ యజమానులు గానీ, మరే ఇతర వ్యక్తులు గానీ నిషేధిత గంజాయి లాంటి మత్తు పదార్థాలను విక్రయించడం, సరఫరా చేయడం లాంటివి చేస్తే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గంజాయికి బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
-----------------------
Admin