Monday, 27 July 2026 07:31:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్వచ్ఛతే సేవా సేవ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్

Date : 20 September 2025 03:33 PM Views : 194

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ' సేవా పక్షం' కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మరియు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం వరంగల్ జిల్లా నర్సంపేట లోని సర్వాపురం హనుమాన్ టెంపుల్ బూత్ నెంబర్179 నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో సర్వాపురం పరిసర ప్రాంతాలలో గల హనుమాన్ టెంపుల్ లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పట్టణ నాయకులతో కలిసి చీపురు పట్టి హనుమాన్ గుడి ప్రాంగణంలో శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ప్రధాని మోడీ గారు భారతదేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సబ్కా సాథ్ – సబ్కా వికాస్ అనే నినాదంతో దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, కృషి చేసి కృషివేత్తలకు మద్దతు – ప్రతి రంగంలో అపూర్వమైన మార్పులు తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో ముందంజలో నిలిపారు. మోడీ దృష్టి, దృఢ సంకల్పం వల్లే నేడు భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించింది. ఆయన నాయకత్వంలో దేశం సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మేము కూడా మోడీ ఆశయాలను అనుసరించి ప్రజాసేవలో కొనసాగుతాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ ,బీజేవైఎం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నియోజకవర్గ యువ మోర్చా మాజీ కన్వీనర్ మనీష్ గౌడ్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, వరంగటి రాజ్ కుమార్ సీనియర్ నాయకులు కొనుగోటి రవీంద్ర చారి, ముత్యాము శ్రీనివాస్ , మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :