సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఎందరో త్యాగాధనుల పోరాట ఫలితంగానే మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ముందుగా పార్టీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి కామేష్ మాట్లాడుతూ ఎందరో పోరాటం ఫలితంగా మనం స్వేచ్ఛయుత జీవితాన్ని కొనసాగిస్తున్నామని,ప్రజాస్వామ్యనికి భారత్ తల్లిలాంటిదని,ఇక్కడ అన్ని కులాలు,మతాల వారు కలిసి మెలిసి జీవించే గొప్ప లౌకిక దేశం అని రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా ప్రజలు జీవించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,పట్టణ అధ్యక్షుడు వంగా రవిశంకర్,తాటిపాముల హరికృష్ణ,సందేల సందీప్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin