సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ మెయిన్ హాస్పిటల్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (ఏ సి ఎం ఓ) గా నూతన భాద్యతలు స్వీకరించిన Dr. శ్రీ విక్టర్ వందనం గారిని మరియు డీప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (డి వై. సి ఎం ఓ)గా నూతన భాద్యతలు స్వీకరించిన శ్రీమతి Dr.సునీల మేడం గారిని మాలమహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర నాయకుడు ఎస్. మధుసూదన్ రావు (చిన్ని)ఆధ్వర్యంలో ది.2-9-.2023 శనివారం ఉదయం వారి కర్యాలయంలలో కలుసుకొని సాలువాలు కప్పి, మొక్కలను బాహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు Dr. శ్రీ విక్టర్ వందనం గారు మరియు శ్రీమతి Dr. సునీల గారు కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు అందించిన వైద్య సేవలను కొనియాడారు. ఉద్యోగోన్నతులు పొందిన వీరు భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందించి, కార్మికుల , ఉద్యోగులఅభిమానాన్ని పొంది ఉత్తమ వైద్య అధికారులుగా పేరుగాంచాలని ఆకాంక్షించారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములై, ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని అభినందించారు. దళిత సంఘాల నాయకుడు కేడెం మనీష్ విక్టర్, ఎస్సీ. ఎస్టీ .బీసీ.సంగం నాయకుడుమరియు టి బి జి కే ఎస్ కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ జె. శ్రీనివాస్, టి బి జి కే ఎస్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ సి.హెచ్. జాన్సన్ సుధాకర్, రాష్ట్ర మాలమహానాడు సహాయ కార్యదర్శి కూరపాటి రవీందర్, మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు నక్కా సృజన, జిల్లా మాలమహానాడు ప్రధాన కార్యదర్శి పనికెల సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు S. నాగేందర్ (బుస్సి ), మరియపూడి సుజాత, సబ్బారాపు కృష్ణ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin